
నస్రుల్లాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మహమ్మద్ నగర్ స్కూల్ తనిఖీ
మహమ్మద్ నగర్ (ఎల్లారెడ్డి ), వెలుగు : మండల కేంద్రంలోని గవర్నమెంట్ స్కూల్ ను బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం తనిఖీ చేశారు. స్కూల్లోని సమస్యలపై పదో విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ సవాయ్ సింగ్, స్కూల్ హెచ్ఎం మధుసూదన్ ఉన్నారు.