
తలకొండపల్లి, వెలుగు: వాహనాల్లోని బ్యాటరీల చోరీకి పాల్పడుతున్న దొంగను తలకొండపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో గత నెలలో రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లోని బ్యాటరీలను హైదరాబాద్లోని ఫలక్నుమాకు చెందిన సయ్యద్ఇర్ఫాన్ హుస్సేన్, బండ్లగూడకు చెందిన అర్సాలం అహ్మద్ అలియాస్అబ్రార్, ఇబ్రహీం అహ్మద్ కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో సయ్యద్ ఇర్ఫాన్ హుస్సేన్ను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు.