మంత్రి కోమటిరెడ్డికి భౌమాకోన్ ఆహ్వానం

మంత్రి కోమటిరెడ్డికి భౌమాకోన్  ఆహ్వానం

హైదరాబాద్: అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్ తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో  ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’ నిర్వహించనుంది. దీనికి ముఖ్యఅతిథిగా రావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. 

ప్రతీఏటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ప్రదర్శించే ఈ ఎక్స్ పోలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వెయ్యికి పైగా సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతాయని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించే ఈ ప్రదర్శనలో టెక్నికల్ సెషన్స్, ప్రాడక్ట్ సొల్యూష్యన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయని తెలిపారు.