
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ విజ్ఞప్తి మేరకు రామగుండంలో త్వరలో రూ.35 కోట్లతో బీసీ సంక్షేమ భవన్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్.. మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే మంత్రి సీతక్క, ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.