కులగణన చేపట్టాలని 2న కలెక్టరేట్ల ముట్టడి : జాజుల శ్రీనివాస్ గౌడ్

కులగణన చేపట్టాలని 2న కలెక్టరేట్ల ముట్టడి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సమగ్ర కులగణనను వెంటనే ప్రారంభించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై వచ్చే నెల 2న అన్ని జిల్లాల కలెక్టరేట్ లను ముట్టడించాలని ఆయన బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. 

ఈ నెల 26నే ముట్టడి చేపట్టాలని నిర్ణయించినప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాయిదా వేసినట్టు శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ల ముట్టడిలో రాజకీయ పార్టీలకతీతంగా వేలాదిమంది బీసీలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం తగ్గించడంతో బీసీలు వేల సంఖ్యలో లోకల్ బాడీ పదవులకు దూరమయ్యారని ఆయన చెప్పారు.