సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు..

బీసీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీసీ సంక్షేమ సంఘం నేతలు.రాష్ట్రంలో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు నేతలు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం నేతలు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే  శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.