IND vs BAN 2024: బంగ్లాతో రెండో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs BAN 2024: బంగ్లాతో రెండో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

చెన్నై టెస్టులో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 న జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఎంపిక చేసిన స్క్వాడ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు.    

రెండో టెస్టుకు టీమ్ ఇండియా జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ . సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్