బీడీఎల్​లో మేనేజ్‌‌‌‌మెంట్ ట్రైనీ

బీడీఎల్​లో మేనేజ్‌‌‌‌మెంట్ ట్రైనీ

ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వివిధ బీడీఎల్‌‌‌‌ యూనిట్లలో 45 మేనేజ్​మెంట్​ ట్రైనీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు (ఫైనాన్స్)/ వెల్ఫేర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌/ జేఎం పోస్టులకు 28 సంవత్సరాలు; ఇతర ఖాళీలకు 27 ఏళ్లు మించకూడదు. 

సెలెక్షన్​: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత ఆన్‌‌‌‌లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష డిసెంబర్ 2023/ జనవరి 2024 లో నిర్వహించనున్నారు. వివరాలకు  www.bdl-india.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.