మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి

 మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి

బెల్లంపల్లి రూరల్, వెలుగు: స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా వ్యాపార రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి చెందాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. నెన్నెల మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ దుకాణం, మెడికల్​షాప్​ను శుక్రవారం కలెక్టర్​కుమార్​దీపక్, డీఆర్డీవో కిషన్​తో కలిసి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెట్టుబడులు లేక గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారాలు చేయడం లేదని వారంతా సెర్ప్ ద్వారా ప్రభుత్వ పథకాలను, ప్రోత్సహకాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం చిత్తాపూర్​లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. నందులపల్లి, గన్​పూర్, గంగారాం ప్రాథమిక పాఠశాలల్లో రూ.30 లక్షల నిధులతో చేపట్టబోయే ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆవుడం గ్రామంలో రూ.4 లక్షల ఎస్​డీఎఫ్​నిధులతో చేపట్టబోయే సైడ్​డ్రైన్​పనులకు భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్​నాయకులు గట్టు మల్లేశ్, హరీశ్​గౌడ్, మల్లాగౌడ్, తోట శ్రీనివాస్, మొహిద్​ఖాన్, ఎంపీడీఓ దేవేందర్​రెడ్డి, ఏపీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.