- డీవీసీ నుంచి నీటి విడుదలపై బెంగాల్ సీఎం మమత
- ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాసిన దీదీ
- వరదలతో 50 లక్షల మందికిపైగా ప్రజలు నష్టపోయారని వెల్లడి
కోల్కతా: బెంగాల్ను ముంచెత్తిన వరదలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరో మారు లేఖ రాశారు. తమ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే రిజర్వాయర్లనుంచి దామోదర్వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) నీటిని విడుదల చేసిందని తెలిపారు. దీంతో వరదలు సంభవించి, 50 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు వెంటనే నిధులు మంజూరుచేయాలని కోరారు.
కాగా, పీఎం మోదీకి మమతా బెనర్జీ రాసిన మొదటి లేఖపై కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్పాటిల్స్పందిస్తూ.. రిజర్వాయర్లనుంచి నీటిని విడుదల చేసేటప్పుడు ప్రతి స్టేజ్లో తమ అధికారులు బెంగాల్ సర్కారుకు సమాచారం ఇచ్చారన్నారు. తీవ్ర కరువును ఎదుర్కొనేందుకు ఈ నీటి విడుదల తప్పనిసరని చెప్పారు.
ఏకపక్షంగా నిర్ణయాలు..
కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్పాటిల్వ్యాఖ్యలను మమత తోసిపుచ్చారు. ‘‘అన్ని కీలక నిర్ణయాలు సెంట్రల్వాటర్కమిషన్, జల్శక్తి మంత్రిత్వశాఖ ఏకపక్షంగా తీసుకుంటాయి” అని తెలిపారు. నీటిని విడుదల చేసేటప్పుడు తమప్రభుత్వంతో చర్చించాలె. కానీ, అలా జరగలేదని అన్నారు. రాష్ట్ర సర్కారుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొన్నిసార్లు నీటిని విడుదల చేస్తున్నారని, తమ అభిప్రాయాలను గౌరవించడం లేదని తెలిపారు.
రిజర్వాయర్లనుంచి తొమ్మిది గంటలపాటు నీటిని విడుదల చేసినప్పుడు కేవలం 3 గంటల ముందే సమాచారం ఇచ్చారని, అంత తక్కువ సమయంలో అత్యవసర సహాయక చర్యలు తీసుకోవడం కుదరదని అన్నారు.