
- 1. 587 కేజీల బంగారు కిరీటం
అలంపూర్,వెలుగు: ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారికి ఆదివారం బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల బృందం భారీ బంగారు కిరీటం అందజేశారు. 1.587 గ్రాముల బంగారు కిరీటంతో వచ్చిన భక్తులకు ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అర్చకులు స్వాగతం పలికారు.
జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కిరీటాన్ని ఈవోకు అందజేశారు. ఆలయ అర్చకులు అమ్మవారికి కిరీటాన్ని అలంకరించారు. బంగారు కిరీటం విలువ రూ. 1 .60 కోట్లకు పైగా ఉన్నట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు జగదీశ్వర్ గౌడ్, పులిందర్, గోపాల్ ,వెంకటేశ్వర్లు, విశ్వనాథరెడ్డి తదితరులు
పాల్గొన్నారు.