
హైదరాబాద్, వెలుగు: ఐపీఓకు రావడానికి సిద్ధమవుతున్నామని, 2027లో పబ్లిక్ఇష్యూ ఉండొచ్చని వంట పాత్రల తయారీ కంపెనీ బెర్గ్నర్ ఇండియా ఎండీ ఉమేశ్గుప్తా చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రియాకు చెందిన తమ కంపెనీ ఇండియా మార్కెట్లో 1,800 రకాల ప్రొడక్టులను అమ్ముతోందని చెప్పారు.
‘‘వీటిలో చాలా ప్రొడక్టులను మిడిల్ఈస్ట్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మాకు ఇండియా వ్యాప్తంగా ఎనిమిది వేల మంది డీలర్లు ఉన్నారు. ఢిల్లీలో ప్లాంటు ఉంది. వచ్చే ఏడాది 30 శాతం గ్రోత్ను ఆశిస్తున్నాం. హైదరాబాద్ మార్కెట్లో 12 శాతం వరకు గ్రోత్ ఉండొచ్చు. తెలంగాణలో మాకు 172 మంది డీలర్లు ఉన్నారు”అని ఉమేశ్ గుప్తా వివరించారు.