
తామరగింజలను పూల్ మఖానా అంటారు. వీటిలో పాల గ్రంథులను ఉత్పత్తి చేసే లక్షణాలు ఎక్కువుగా ఉంటాయి. పూర్వకాలంలోబాలింతలకు రోజు వీటి పొడిని అన్నం తినేటప్పుడుకు ఒక ముద్ద పెట్టేవారు. కాని రాను రాను కాలం మారడంతో తామరగింజల ఫుడ్ను మర్చిపోయారు. ఇప్పుడు బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకుంటే.. పసిపిల్లలకు పుష్కలంగా పాలు ఇవ్వగలుగుతారు. పూల్ మఖానాతో అచ్వానీ అనే ఫుడ్ ఐటమ్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ..
పూల్ మఖానాతో అచ్వానీ తయారీకి కావలసిన పదార్దాలు
- బెల్లం – 200 గ్రాములు
- ఫూల్ మఖానా – 50 గ్రాములు
- బాదం, జీడిపప్పు తరుగు, ఎండుద్రాక్ష – ఒక్కో టేబుల్ స్పూన్
- గసగసాలు, చరోలి (మొర్రి పండు గింజలు) – ఒక్కో టేబుల్ స్పూన్
- పుచ్చకాయ గింజలు, వెన్న – ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
- ఎండుకొబ్బరి – అర కప్పు
- ఎడిబుల్ గమ్, వాము – ఒక టీస్పూన్
- గోధుమ పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్
- జాజికాయ – పావు టీస్పూన్
- మిరియాలు, శొంఠి పొడి, పసుపు – ఒక్కోటి అర టీస్పూన్
- దాల్చిన చెక్క – చిన్న ముక్క
- యాలకులు – నాలుగు
- నీళ్లు – సరిపడా
తయారీ విధానం: ఒక పాత్రలో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. మిక్సీజార్లో యాలకులు, మిరియాలు, వాము, దాల్చిన చెక్క, జాజికాయ, శొంఠిపొడి, పసుపు వేసి గ్రైండ్ చేయాలి. పాన్లో నెయ్యి వేడి చేసి అందులో మఖానా వేసి వేగించాలి. అదే పాన్లో బాదం, జీడిపప్పు తరుగు, ఎండుద్రాక్ష, చరోలి (మొర్రి పండు గింజలు), పుచ్చకాయ గింజలు వేసి వేగించాలి. అవి వేగాక అందులో కొబ్బరి తురుము కూడా వేయాలి.
ఆ తర్వాత పాన్లో వెన్న వేడి చేసి అందులో గోధుమపిండి వేసి కలపాలి. తర్వాత ఎడిబుల్ గమ్, గ్రైండ్ చేసుకున్న పొడి మిశ్రమం, గసగసాలు వేసి కలపాలి. అందులో బెల్లం పాకం నీళ్లు పోయాలి. ఆ మిశ్రమంలో వేగించి పెట్టుకున్న మఖానాతోపాటు మిగిలిన డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక సర్వ్ చేయడమే. దీన్ని గుడ్ కీ పాట్, హరిరా అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఇమ్యూనిటీ పెరగడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. పాలిచ్చే తల్లులకు మరీ మంచిదట!
–వెలుగు,లైఫ్–