కిచెన్లో ఏ డబ్బాలో ఏముందోననే కన్ఫ్యూజన్​ ఉండకూడదంటే..

కిచెన్లో ఏ డబ్బాలో ఏముందోననే కన్ఫ్యూజన్​ ఉండకూడదంటే..

కిచెన్లో అనేక స్పైసెస్, పప్పు దినుసుల డబ్బాలు ఉంటాయి. ఒక్కోసారి ఏ డబ్బాలో ఏముందో మర్చిపోయి ఒకదానికి బదులు మరో డబ్బా తీస్తుంటాం. అలాంటి కన్ఫ్యూజన్​ ఉండకూడదంటే.. ఇలాంటి ప్రింటర్‌‌తో లేబుల్స్​ ప్రింట్ ​చేసి డబ్బాలపై అతికిస్తే సరిపోతుంది.

దీన్ని ఆర్​ఐఐటెక్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీన్ని బ్లూటూత్​ ద్వారా మొబైల్కి కనెక్ట్‌‌ చేసుకుని యాప్​ ద్వారా ఆపరేట్​ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్​తోపాటు ఐఓఎస్​ డివైజ్​లకు కూడా సపోర్ట్‌‌ చేస్తుంది. ఇందులో ఇంక్​ నింపాల్సిన అవసరం లేదు. థర్మల్​ టెక్నాలజీతో పనిచేస్తుంది.

ఇంక్‌‌జెట్ ప్రింటర్‌‌లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ప్రింట్ చేసుకోవచ్చు. ఫుడ్​ స్టోరేజీ బాక్స్లతోపాటు బట్టల కప్​బోర్డ్స్, ఫ్రిడ్జ్లో వాడే స్టోరేజీ కంటైనర్స్​, ఆఫీస్​లో ఫైల్స్​ మీద అతికించే లేబుల్స్​ని దీంతో ప్రింట్ చేసుకోవచ్చు.

ఇందులో 1200mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్​ చార్జ్​ చేస్తే.. 4 గంటలపాటు పనిచేస్తుంది. కనీసం వారం పాటు స్టాండ్‌‌బైలో ఉంటుంది. దీంతో పాటు ప్యాక్​లో 12 x 40 ఎంఎం లేబుల్ టేప్‌‌ కూడా వస్తుంది.

ధర: 3,199