
- ప్రయాణికులు, నెటిజెన్ల విమర్శలు
- తొలగించాలని ఆదేశించామన్న ఎండీ ఎన్వీఎస్రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: సినీ తారలు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయన్సర్లు బెట్టింగ్యాప్స్ ను ప్రమోట్చేసి కేసుల్లో ఇరుక్కోగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా నెటిజన్స్నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి కారణం మెట్రో రైళ్లు కూడా బెట్టింగ్యాప్లను ప్రమోట్చేయడమే.. రైళ్ల బయట, లోపల బెట్టింగ్ యాప్స్ యాడ్స్ స్టికర్లు కనిపిస్తున్నాయి.
వాటిని ఫొటోలు, వీడియోలు తీసి.. నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విమర్శిస్తున్నారు. ఆన్లైన్బెట్టింగ్ యాప్స్ ను వ్యతిరేకిస్తూ మొదటి నుంచి సూచనలు చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విటర్) ఖాతాకు ట్యాగ్ చేస్తూ హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ మెట్రో యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ప్రమోట్చేసిన సినీతారలు, యూట్యూబర్లపై కేసులు పెట్టారని, మెట్రో రైల్పై కూడా కేసులు పెట్టాల్సిందేనని డిమాండ్చేస్తున్నారు.
ప్రకటనలు తొలగిస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి
మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వీటిని గురువారం రాత్రే తొలగించాలని అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.