
భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 36 రోజులకు రూ.1,31,84, 181 ఆదాయం వచ్చింది. చివరిసారి మార్చి 27న హుండీలు లెక్కించారు. 25 యూఎస్ డాలర్లు, 55 యూఏఈ థీరమ్స్, 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 20 థాయిలాండ్ భాట్స్, 17 సౌదీ రియాల్స్తో పాటు వెండి 1.450 కిలోలు, 230 గ్రాముల బంగారం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 17వ తేదీన శ్రీరామనవమి, 18న శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయానికి ఆదాయం పెరిగింది.