
భద్రాచలం, వెలుగు: వానాకాలం నాటికి కరకట్ట పనులు పూర్తవ్వాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీర్లతో సంబంధిత పనులపై రివ్యూ చేశారు. నేషనల్ హైవే నుంచి రావాల్సిన అనుమతి కోసం చేపట్టిన సాయిల్ టెస్ట్వివరాలను అధికారులు ఆయనకు వివరించారు.
వానాకాలంలోపే రెండు వైపులా కరకట్ట, గేట్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఈఈ జానీ, డీఈలు మధుసూదన్రావు, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.