కామన్​ వెల్త్ పవర్​ లిఫ్టింగ్​ పోటీల్లో ఇండియాకు బంగారు పతకం

కామన్​ వెల్త్ పవర్​ లిఫ్టింగ్​ పోటీల్లో ఇండియాకు బంగారు పతకం
  • భద్రాచలం మన్యం వీరుడు మోడెం వంశీ ఘనత

భద్రాచలం, వెలుగు :  సౌతాఫ్రికాలోని సన్​ సిటీలో ఈనెల 4 నుంచి 13 వరకు జరిగిన కామన్​ వెల్త్ పవర్​ లిఫ్టింగ్ పోటీల్లో ఇండియాకు బంగారు పతకాన్ని భద్రాచలం మన్యానికి చెందిన మోడెం వంశీ అందించారు. ఈ పోటీలలో పాల్గొని మొత్తం 677.5 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగెస్ట్ మాన్​ ఆఫ్​ వరల్డ్ మెరిట్​ సర్టిఫికెట్​ను వంశీ సాధించాడు. బెంచ్ ప్రెస్, డెడ్​లిఫ్ట్, స్క్వాట్​ విభాగాల్లో మూడు బంగారు పతకాలతో పాటు పవర్​ లిఫ్టింగ్​లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు బంగారు పతకం అందుకున్నాడు. 

గతంలో కూడా యూరప్​లోని మాల్దాదేశంలో జరిగిన ఇంటర్నేషనల్​పవర్​ లిఫ్టింగ్​ పోటీల్లో పాల్గొన్న ఈ గిరిజన యువకుడు బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా వంశీని భద్రాద్రి వాసులు అభినందించారు.