భద్రాద్రిటెంఫుల్​ప్రధాన అర్చకుడి సస్పెన్షన్

భద్రాద్రిటెంఫుల్​ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
  • అతడితోపాటు కుమారుడిని సస్పెండ్ చేసిన అధికారులు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఈవో రమాదేవి
  • కోడలి ఫిర్యాదుతో తాడేపల్లి గూడెంలో కేసు నమోదు తో చర్యలు

భదాద్రి కొత్తగూడెం: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంఫుల్​ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామచంద్రాచార్యులు, అతని కొడుకు  సీతారాంపై  దేవాదాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.  ఈ క్రమంలో ఆలయ డ్యూటీల నుంచి  వారిద్దరినీ  సస్పెండ్​చేస్తూ  టెంఫుల్​ ఈవో ఎల్​ రమాదేవి ఉత్వర్తులు జారీ చేశారు.  తన కోడలు ప్రసన్న పై   లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ..  తాడేపల్లి గూడెం పీఎస్​లో కంప్లైట్​అందిన నేపథ్యంలో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

కోడలు ఆత్మహత్యాయత్నం.. 

భద్రాచలం టెంఫుల్​లో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామచంద్రాచార్యులు, అతని దత్తపుత్రుడు సీతారాంకు తాడేపల్లి గూడెంకు చెందిన ప్రసన్నతో మ్యారేజీ అయింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా  మామ రామచంద్రాచార్యులు  తనను  లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ..కంప్లైట్​చేసింది. 

రూ.10 లక్షలను వరకట్నం తీసుకురావాలని, లేదంటే తన కొడుకుకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తానని బెదిరించిన్నట్లుగా బాధితురాలు చెప్పింది. భర్త సీతారాం, అడపడుచు సైతం వరకట్నం కోసం రోజు ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో అత్తంటి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లి ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి  పాల్పడింది.  విషయాన్ని పేరెంట్స్​ గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు.  ప్రసుత్తం ప్రసన్న హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు.  ఈ ఆరోపణలపై  స్పందించిన  దేవాదాయశాఖ ఇద్దరినీ డ్యూటీ నుంచి సస్పెండ్​ చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.