లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు : ఎస్పీ రోహిత్​రాజ్​

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు : ఎస్పీ రోహిత్​రాజ్​

భద్రాచలం, వెలుగు : లొంగిపోయిన మావోయిస్టులకు చర్ల పీఎస్ లో భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్​రాజ్​రివార్డులు అందజేశారు.  మడివి సోమమ్మ అలియాస్ ​సునీత, మడకం లింగా అలియాస్ ​రాకేశ్, మడివి భద్రయ్య అలియాస్​ భుద్రకు రూ. 4 లక్షల చొప్పున , కట్టం పొజ్జయ్యకు రూ.40వేలు, కల్ము భుద్రకు రూ.20వేలు అందజేశారు.  మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ జీవితం గడపాలని ఎస్పీ రోహిత్​రాజ్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను పోలీసులు తీసుకుంటారని 

పేర్కొన్నారు.