దమ్మపేటలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

దమ్మపేటలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

దమ్మపేట, వెలుగు : మండలంలో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా తహసీల్దార్​ కార్యాలయంలో వచ్చి ధరణి పనితీరును పరిశీలించారు. కార్యాలయం ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు.  

భూ రిజిస్ట్రేషన్లు, ఇతర అవసరాల కోసం వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు, అధికారుల నుంచి అందుతున్న సేవలను  తెలుసుకున్నారు. రైతులు కలెక్టర్​ను శాలువాతో సన్మానించారు.