పాండురంగాపురంలో కలెక్టర్​ పర్యటన

పాండురంగాపురంలో కలెక్టర్​ పర్యటన

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​వి పాటిల్​ సోమవారం పర్యటించారు. లోతువాగు, కెనాల్​ ప్లాంటేషన్​ పనులను పరిశీలించారు.  వర్షాకాలంలో పంట భూములు కోతకు గురవుతున్నాయని, లోతువాగు కిన్నెరసాని వాగులో కలుస్తున్న ప్రాంతం నేల మెత్తటి ఇసుకతో ఉందని, గతంలో  రైతులు వెదురు మొక్కలు వేసినప్పటికీ కోతకు గురౌతున్నాయని రైతులు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు.

 ఉపాధిహామీ పథకం, ఇరిగేషన్​శాఖ అధికారులు సమన్వయంతో యాక్షన్​ ప్లాన్​ తయారు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం పాండురంగాపురం, జడ్పీహెచ్​ఎస్​ ను సందర్శించి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్​ ఈఈ  తిరుపతి, ఎంపీడీవో విజయభాస్కర్​ రెడ్డి, తహసీల్దార్​ వివేక్, ఇరిగేషన్​ డీఈ రాణి, ఎంపీవో నారాయణ, ఏపీఎం రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.