ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న మిస్టర్ బచ్చన్ హీరోయిన్..

ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న మిస్టర్ బచ్చన్ హీరోయిన్..

గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ఒక్క సినిమాతోనే  మోస్ట్  హ్యాపెనింగ్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకుంది. తనదైన గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ ఏడాది ముచ్చటగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. వాటిలో ముందుగా విడుదలయ్యేది  ‘కింగ్‌‌‌‌‌‌‌‌డమ్’. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలవనుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. మరోవైపు హీరో రామ్‌‌‌‌‌‌‌‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది భాగ్యశ్రీ. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. 

త్వరలోనే మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు. అలాగే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌కు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 1950 మద్రాస్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ  చిత్రంలో భాగ్యశ్రీ వింటేజ్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనువిందు చేయనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది.  ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. అంటే ఈ ఏడాది తన నుంచి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు విడుదలవడం లక్కీ చాన్స్‌‌‌‌‌‌‌‌ అనే చెప్పాలి. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులకు భాగ్యశ్రీ కమిట్ అయినట్టు తెలుస్తోంది.