భయ్యా తోడా ప్యాజ్​ బేజో!

భయ్యా తోడా ప్యాజ్​ బేజో!
  • స్విగ్గీ ఫుడ్​ ఆర్డర్​లో రెస్టారెంట్​ యజమానికి వినియోగదారుడి విజ్ఞప్తి
  • ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆవేదన

న్యూ ఢిల్లీ: ‘భయ్యా తోడా ప్యాజ్​ డాలో’.. ఈ డైలాగ్​ మనకు ప్రతి పానీపూరి బండి దగ్గర వినిపిస్తుంది. అయితే, స్విగ్గీలో ఫుడ్​ ఆర్డర్​ పెట్టిన ఓ వ్యక్తి కూడా అచ్చం ఇలాంటి డైలాగ్​నే వాడి, అందరి దృష్టిని ఆకర్షించాడు.  తనకు రౌండ్​గా కట్​ చేసిన ఉల్లిగడ్డలు తప్పనిసరిగా పంపాలని రిక్వెస్ట్​ చేశాడు. ఉల్లిగడ్డల ధర పెరిగిందని, తాను వాటిని కొనలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘దయచేసి కొన్ని ఉల్లిగడ్డలు పంపండి అన్నా’’ అంటూ అభ్యర్థించాడు.

ఈ రిక్వెస్ట్​ను అతడి ఫ్లాట్​మేట్​ స్క్రీన్​షాట్​ తీసి సోషల్​ మీడియాలో పెట్టగా, వైరల్​గా మారింది. ఈ పోస్ట్​పై స్విగ్గీ కో ఫౌండర్​ ఫణి కిషన్​ అడ్డెపల్లి స్పందించారు. స్విగ్గీ ఇన్​స్టామార్ట్​వినియోగదారులకు ఆశ్చర్యకరమైన ఆఫర్​ ప్రకటించారు. 

ఢిల్లీ ఎన్సీఆర్​పరిధిలో కిలో రూ.70–రూ.80 ధర పలుకుతుండగా.. స్విగ్గీ ఇన్ స్టామార్ట్​లో రాత్రి 7–8 గంటల వరకు రూ. 39కే కిలో ఉల్లిగడ్డలను అందిస్తున్నట్టు ప్రకటించారు. స్టాక్​ ఉన్నంత వరకు ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుందని ఫణి కిషన్​ వెల్లడించారు.