ప్రభుత్వానికి సాయంగా న్యూరల్ ఏఐ గవర్నెన్స్‌‌

ప్రభుత్వానికి సాయంగా న్యూరల్ ఏఐ గవర్నెన్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  హైదరాబాద్‌‌లోని ట్రైడెంట్ హోటల్‌‌లో న్యూరల్  ఏఐ గవర్నెన్స్ సమ్మిట్ 2025ను  భారత్ లైట్‌‌హౌస్ (బీఎల్‌‌హెచ్‌‌) నిర్వహించింది. ప్రజా పరిపాలనను న్యూరల్  ఏఐ గవర్నెన్స్ ఎలా మార్చగలదు? అనే అంశంపై ఈ సమ్మిట్‌‌లో చర్చించారు.

ప్రభుత్వ అధికారులు,  ఏఐ ఎక్స్‌‌పర్ట్‌‌లు, వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు.  భారత్ లైట్‌‌హౌస్  సీఈఓ మోహన్ కుమార్ కేఆర్‌‌‌‌, కోఫౌండర్‌‌‌‌  దీప్తి గనుగపెంట ఈ కార్యక్రమానికి  నేతృత్వం వహించారు.   న్యూరల్  ఏఐ గవర్నెన్స్‌‌తో  ప్రభుత్వ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా, పారదర్శకతతో నిర్వహించొచ్చని మోహన్ అన్నారు.  డేటా భద్రతపై ఫోకస్ పెట్టామన్నారు.