
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి
- భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డి
నిజామాబాద్, వెలుగు: పదేండ్ల కింద మూసేసిన సారంగాపూర్కో– ఆపరేటివ్షుగర్ఫ్యాక్టరీని(ఎన్సీఎస్ఎఫ్) రీ ఓపెన్ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నెరవేర్చాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయిరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రీ ఓపెన్ చేసేదాకా పోరాడుతామని పేర్కొన్నారు. మంగళవారం కిసాన్సంఘ్వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిటీలోని మారుతీనగర్గణేశ్భవన్లో నిర్వహించిన ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడారు.
పంట మార్పిడితో రైతులను చెరుకు సాగు వైపు మళ్లించి లాభాల బాట పట్టేలా చేయొచ్చన్నారు. తద్వారా వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్విభాగ్ప్రచారక్నర్రా వెంకటశివకుమార్, కిసాన్సంఘ్ప్రతినిధులు కె.నారాయణరెడ్డి, గడ్డం దశరథ్రెడ్డి, రైతు ఉత్పత్తిదారుల సంఘం స్టేట్జనరల్సెక్రటరీ డి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.