బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపూర్​లో కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ మాజీ ప్రధాన కార్యదర్శి బందారం క్రాంతి సోదరుడు భాస్కర్​అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలసుకున్న డీసీసీ ప్రెసిడెంట్​కొమ్మూరి ప్రతాప్​రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను ఫోన్​ద్వారా పరామర్శించారు.

తక్షణ సాయం కింద రూ.10 వేలు పంపించగా, మండలాధ్యక్షుడు నూకల బాల్​రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయనవెంట మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎండీ మసూద్, గ్రామ అధ్యక్షుడు నర్సింహులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.