భట్టి మార్క్.. 2 గంటల పాటు ప్రసంగం

భట్టి మార్క్.. 2 గంటల పాటు ప్రసంగం

రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపు రెండు గంటల పాటు చదివారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మొదలవ్వగానే ప్రారంభమైన బడ్జెట్ స్పీచ్​లో గత ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర సర్కార్ పాలసీలను భట్టి హైలెట్ చేశారు. అయితే భట్టి గత ప్రభుత్వానికి సంబంధించి ఏమి ప్రస్తావించినా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగులుతూ వచ్చారు. 

బోగస్ అంటూ గట్టిగా అరుస్తు స్పీచ్​కు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. స్పీకర్​ వారించినా వినలేదు. అదే సమయంలో ప్రభుత్వ పాలసీలను ప్రకటిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిచారు. బడ్జెట్ స్పీచ్ మొదలైన రెండు నిమిషాలకు మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి సభలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల సీట్లు అసెంబ్లీలో మారాయి.