పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నరు: డిప్యూటీ సీఎం భట్టి

పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ  చేస్తున్నరు: డిప్యూటీ సీఎం భట్టి

పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు ఎఫ్ టీ ఎల్ లో కట్టుకున్న ఇండ్లు కూల్చేస్తున్నామని చెప్పారు.  ఇంకా బఫర్ జోన్ పై నిర్ణయం తీసుకోలేదన్నారు భట్టి. 

హైదరాబాద్ అంటేనే  లేక్స్, రాక్స్,  పార్క్స్  అని అన్నారు భట్టి విక్రమార్క.  లేక్స్ లో ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారని.. మూసిలో కూడా ఇండ్లు కట్టుకున్నారు.. అది వారికి .. వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదన్నారు. మూసిలో ఇండ్లు కట్టుకున్న వాళ్లకి బయట డబుల్ బెడ్ రూం ఇస్తున్నామని తెలిపారు. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు భట్టి. కొన్ని రోజులుగా హైడ్రా పేదలు,నిరుపేదల ఇళ్లు కూల్చుతుందన్న వార్తల నేపథ్యంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.