జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌.. భవేశ్ రెడ్డికి టైటిల్‌‌‌‌

జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌.. భవేశ్ రెడ్డికి టైటిల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (జేబీసీ)–తెలంగాణ ఓపెన్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు చెందిన భవేశ్ రెడ్డి టైటిల్ నెగ్గాడు. శనివారం జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌13 బాయ్స్‌‌‌‌ ఫైనల్లో భవేశ్‌‌‌‌ 15–13, 15–4తో దర్ష్‌‌‌‌ గోయెల్‌‌‌‌పై నెగ్గాడు. గర్ల్స్​ అండర్‌‌‌‌‌‌‌‌15 ఫైనల్లో మన్య 15–9, 15–11తో ఏంజెడ్‌‌‌‌లోను ఓడించింది. అండర్‌‌‌‌‌‌‌‌17 తుదిపోరులో మన్య 15–11, 15–14తో అనన్యపై వరుస గేమ్స్‌‌‌‌లో గెలిచింది. ఇండియా డబుల్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ షట్లర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌, ‌‌‌‌ చిరాగ్ షెట్టి విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.