ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

భీమదేవరపల్లి, వెలుగు : స్టూడెంట్లను తీసుకెళ్లేందుకు శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి వచ్చిన ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి మూడు, నాలుగు కార్పొరేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్సులు వస్తుండడం వల్ల గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌‌‌‌లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిమూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామంలోని చౌరస్తా వద్ద బస్సులను ఆపి నిరసన తెలపడంతో స్టూడెంట్లను అక్కడే దించి బస్సులు వెళ్లిపోయాయి.