భెల్కు రూ.7,500 కోట్ల విలువైన ఆర్డర్​

భెల్కు రూ.7,500 కోట్ల విలువైన ఆర్డర్​

న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ భారత్​ హెవీ ఎలక్ట్రికల్స్ ​లిమిటెడ్ ​(భెల్​) గుజరాత్​లో 800 మెగావాట్ల థర్మల్​ పవర్ ​ప్లాంటు నిర్మించడానికి రూ.7,500 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకుంది. గుజరాత్ ​స్టేట్ ​ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ​ఇచ్చిన ఈ ప్రాజెక్టు 54 నెలల్లోపు మొదలవుతుంది. కాంపిటీటివ్ ​బిడ్డింగ్​ ద్వారా కాంట్రాక్టును దక్కించుకున్నామని భెల్​ ప్రకటించింది. ప్లాంటు డిజైన్​, ఇంజనీరింగ్​, మానుఫ్యాక్చరింగ్​, సప్లై, టెస్టింగ్​, కమిషనింగ్​పనులను తామే చూసుకుంటామని భెల్​విడుదల చేసిన ప్రకటన తెలిపింది.