శాకుంతలం' ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ కాస్త గ్యాప్ ఇచ్చి మరో సినిమా మొదలుపెట్టాడు. తన భార్య 'నీలిమ గుణ' నిర్మాణంలో 'యుఫోరియా' (Euphoria) అనే యూత్ ఫుల్ సోషల్ డ్రామాని తెరెకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే యుఫోరియా నుంచి డిఫరెంట్ కలర్స్ తో వచ్చిన వీడియో, పోస్టర్ ఆడియన్స్ కి సరికొత్త ఫీలింగ్ ని ఇచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా కూడా డిఫరెంట్ కథతో రానుంది అనే విషయం కూడా క్లియర్ గా అర్థమవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర న్యూస్ తెరపైకి వచ్చింది. మళ్లీ 2 దశాబ్ధాల తర్వాత 'ఒక్కడు' మూవీ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అంటే, మహేష్ బాబు ని తీసుకొస్తున్నాడా ? అనుకోకండి.
ALSO READ | DeepikaPadukone: లేడీ సింగం వచ్చేసింది.. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక అదరగొట్టేసింది
ఒక్కడు హీరోయిన్ భూమిక మరోసారి గుణశేఖర్ తో కలిసి పనిచేయబోతున్నారట. యుఫోరియాలో భూమిక కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. భూమిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ మూవీ పోస్టర్ షేర్ చేయడంతో ఈ వార్త మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఇంతకీ భూమిక ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది సస్పెన్స్ నెలకొంది. త్వరలో భూమిక పాత్రకి సంబంధించిన అప్డేట్ త్వరలో రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం భూమిక తెలుగుతో పాటు బాలీవుడ్ లోను నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె కంగనా రనౌత్ తో కలిసి నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు.. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటున్న భూమిక ఇటీవలే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. 'సమర వెల్నెస్' (Samara Wellness) పేరుతో గోవాలో ఓ హోటల్ స్టార్ట్ చేసింది.
అయితే.. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి జానర్ మార్చి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న గుణశేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.