కాంగ్రెస్​లో చేరిన భూంలింగం గౌడ్

కాంగ్రెస్​లో చేరిన భూంలింగం గౌడ్

మెదక్​ (చేగుంట), వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటకు చెందిన భూంలింగం గౌడ్ కాంగ్రెస్​లో జాయిన్​అయ్యారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్​తో కలిసి గాంధీ భవన్​కు వెళ్లిన ఆయనకు తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్​ మున్షి కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

భూంలింగం గౌడ్​గతంతో బీఆర్ఎస్​ పార్టీలో ఉండేవారు. ఎన్నికల ముందు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కొన్నాళ్లకే మళ్లీ బీఆర్ఎస్​లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి కాంగ్రెస్​లో జాయిన్​అయ్యారు.  చేగుంట మార్కెట్​ కమిటీ మాజీ వైస్​ చైర్మన్​రాజేందర్​రెడ్డి కూడా తన అనుచరులతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ లో చేరారు.