![అండర్ పాస్లు ఏర్పాటు చేయండి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/06/bhuvanagiri-mla-kumbham-anilkumar-reddy-asked-to-establish-underpasses-on-warangal-and-vijayawada-highways_yK9MqJBXd7.jpg)
- మంత్రిని కోరిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : వరంగల్, విజయవాడ హైవేలపై అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి కోరారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో భువనగిరి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. వరంగల్ హైవేపై అండర్ పాస్లు లేక రామక్రిష్ణాపురం, సింగన్నగూడెం, కొండమడుగు, విజయవాడ హైవేపై కొత్త గూడెం వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
నియోజకవర్గంలోని చిట్యాల రోడ్డు, రుద్రవెళ్లి బ్రిడ్జీ పనులు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్అహ్మద్ను ఎమ్మెల్యే కుంభం కలిశారు. భువనగిరి టౌన్లోని రోడ్లను సుందరీకరించాలని కోరారు.
పోచంపల్లి, బీబీనగర్, భువనగిరిలోని చెరువుల వద్ద గతంలో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం మూసీ రీవర్ ఫ్రంట్ఎండీ అమ్రపాలిని కలిసి మూసీ ప్రక్షాళన పనులు చేపట్టాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు.