ప్లాట్లకు పాస్​బుక్స్ .. తహసీల్దార్ ​సస్పెన్షన్..యాదాద్రి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు 

ప్లాట్లకు పాస్​బుక్స్ .. తహసీల్దార్ ​సస్పెన్షన్..యాదాద్రి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు 

యాదాద్రి, వెలుగు : ఖాళీ ప్లాట్లకు పాస్​బుక్స్​ఇచ్చిన యాదాద్రి జిల్లా బీబీనగర్ తహసీల్దార్​సస్పెండ్ అయ్యారు. గతంలో బీబీనగర్​మండల పరిధిలో భారీగా రియల్​ఎస్టేట్​బిజినెస్​నడిచింది. వేల ఎకరాల్లో వెంచర్లు చేసి ప్లాట్లను చేసి అమ్మారు. రూల్స్ కు విరుద్ధంగా అమ్మకాలు చేసిన పలు రియల్​ఎస్టేట్​సంస్థలపై కేసులు కూడా నమోదు అయ్యాయి.

కాగా బీబీనగర్​మండలం పడమటి సోమారంలోని పది సర్వే నంబర్లలో కొన్ని ఖాళీ ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తహసీల్దార్​శ్రీధర్ పాస్​బుక్స్​జారీ చేశారు. దీనిపై ఫిర్యాదు వెళ్లడంతో కలెక్టర్​హనుమంతరావు ప్రాథమికంగా విచారణ చేయించారు. వాస్తవాలు తెలియడంతో తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.