‘మీ శాంతి సందేశం గొప్పది’.. ప్రధాని మోదీకి బైడెన్ ప్రశంస

‘మీ శాంతి సందేశం గొప్పది’.. ప్రధాని మోదీకి బైడెన్ ప్రశంస

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సందేశం గొప్పదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. మోదీ తన పర్యటనతో ఉక్రెయిన్‌‌‎కు శాంతి సందేశం పంపారని ప్రశంసించారు. పోలెండ్, ఉక్రెయిన్ దేశాల్లో మోదీ పర్యటన విశేషాలను తెలుసుకునేందుకు తాను ఆయనతో ఫోన్‎లో మాట్లాడానని బైడెన్ ట్వీట్ చేశారు. "మోదీ ఇటీవల పోలెండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించారు. ఆ విశేషాలను తెలుసుకునేందుకు ఆయనతో ఫోన్‎లో మాట్లాడా.  మోదీ శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగినది. ఇండో-పసిఫిక్‌‎లో శాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మేం మా నిబద్ధతను కూడా  వెల్లడించాం" అని బైడెన్ చెప్పారు. బంగ్లాదేశ్ పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త పరిణామాలెన్నో తమ మధ్య చర్చకు వచ్చాయని మోదీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.