మరింత ఎక్కువ నిద్ర కావాలి: బైడెన్

మరింత ఎక్కువ నిద్ర కావాలి: బైడెన్
  • రాత్రి 8 తర్వాత జరిగే కార్యక్రమాల్లో పాల్గొనలేను

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో అలసిపోతున్నానని, తనకు మరింత నిద్ర అవసరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  అన్నారు. ప్రచార కార్యక్రమాలకు రాత్రి 8 గంటల తర్వాత హాజరుకాలేనని ఆయన తెలిపారు. వైట్ హౌస్​లో జరిగిన డెమోక్రటిక్  గవర్నర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది గవర్నర్లు ఫిజికల్​గా హాజరుకాగా.. మరి కొంతమంది వర్చువల్​గా పాల్గొన్నారు.

రిపబ్లికన్  పార్టీ అభ్యర్థి డొనాల్డ్  ట్రంప్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వివిధ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా పాల్గొంటున్నానని, దీంతో అలసిపోతున్నానని 81 ఏండ్ల  బైడెన్  చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు మరింత నిద్ర కావాలన్నారు. ఈ సమావేశంలో బైడెన్ తన ఆరోగ్యంపై తనే జోకులేసుకున్నారు. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా.. నా బ్రెయిన్ పరిస్థితి ఎలా ఉందనేది తెలవదు కానీ నా మటుకు నేనైతే బాగున్నా’ అని బైడెన్​ నవ్వించారు.