కేసీఆర్కు బిగ్షాక్..బీఆర్ఎస్ఎల్పీకి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ డుమ్మా

కేసీఆర్కు బిగ్షాక్..బీఆర్ఎస్ఎల్పీకి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ డుమ్మా

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసిన కేసీఆర్ కు బిగ్ షాక్.. 2024, జూలై 23వ తేదీ మధ్యాహ్నం.. బీఆర్ఎస్ భవన్ లో పార్టీ మీటింగ్ పెట్టారు కేసీఆర్. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ హాజరుకాలేదు. 

కేసీఆర్ అధ్యక్షన జరిగిన బీఆర్ ఎస్ ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి,  పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ గౌడ్ తోపాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి డుమ్మాకొట్టారు. సమావేశానికి హాజరుకాని వారు పార్టీ మారుతున్నారా ఏంటీ అనే సందేహాలు, చర్చ మొదలైంది.

Also Read:-రైతు రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ కడుపుమంట