అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..

అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో CI తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి CI  జితేందర్ రెడ్డి వేధింపులే కారణమని విచారణలో తేలింది. దీంతో జితేందర్ రెడ్డిని ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అశ్వారావుపేట పీఎస్ లో రైటర్ గా పనిచేస్తున్న సుభానీ, కానిస్టేబుల్స్ శివ, సన్యాసినాయుడు, శేఖర్ ను ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేశారు ఉన్నతాధికారులు.  సీఐ జితేందర్ రెడ్డిపై అశ్వారావుపేట మండలంలో అనేక ఆరోపణలున్నాయి.