బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో కీలక మలుపు.. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిపై కేసు నమోదు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో కీలక మలుపు.. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిపై కేసు నమోదు

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన, ప్రచారం చేసిన సెలబ్రెటీలపై వరసపెట్టి కేసులు నమోదు చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే నిన్నా మొన్నటి వరకు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు సినీ నటులపై యాక్షన్ కు రెడీ అయ్యారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద FIR నమోదు చేశారు. తొలుత నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Also Read :- పంజాగుట్ట పీఎస్కు యాంకర్ విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్  కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా నిందితుల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. యూట్యూబర్లు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ సహా కేసులో నిందితులైన 11 మంది వివరాలతో పాటు వారు ప్రమోట్  చేసిన సోషల్ మీడియా లింకులను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

ఇప్పటికే సేకరించిన డాక్యుమెంట్లతో ఈవారంలో ఈసీఈఐ నమోదు చేయనున్నట్లు తెలిసింది. తరువాత నిందితులను విచారించనున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్లు సహా వారి అకౌంట్లలో డిపాజిట్  అయిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, బెట్టింగ్  యాప్స్  ద్వారా కొల్లగొట్టిన డబ్బు ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. నిందితులు సహా యాప్స్  నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.