BiggBoss 8: బిగ్బాస్ వైల్డ్కార్డ్ ఎంట్రీస్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున.. ఇవాళ మరొకరి ఎలిమినేషన్.. అది ఎవరంటే?

BiggBoss 8: బిగ్బాస్ వైల్డ్కార్డ్ ఎంట్రీస్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున.. ఇవాళ మరొకరి ఎలిమినేషన్.. అది ఎవరంటే?

బిగ్బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Telugu) లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒక్కో వారం చొప్పున ఇప్పటికీ నలుగురు కంటెస్టెంట్స్.. వారిలో వరసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. 

అయితే, ఐదో వారం మాత్రం రెండు సార్లు ఎలిమినేషన్ జరగనుందన్న విషయం నాగ్ ఇప్పటికే కన్ఫమ్ చేశాడు. ఈ పాటికే బిగ్ బాస్ తెలుగు 8 మిడ్ వీక్ ఎవిక్షన్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 3న) హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారని సమాచారం.

నేడు అక్టోబర్ 4న ఆదిత్య స్టేజిపైకి రానున్నారు. అలాగే ఈ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న నైనిక ఎలిమినేట్ కానుందని సమాచారం. ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్  9 మందికి చేరుకుంది.

ఇదిలా ఉంటే.. ఇవాళ శనివారం (అక్టోబర్ 4న) జరిగే ఎపిసోడ్లో 8 మంది సెలబ్రిటీలు.. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్‌ వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారిలో గంగవ్వ, హీరో గౌతమ్ కృష్ణ, హరితేజ, మెహబూబ్ షేక్, జబర్దస్త్ రోహిణి, నయని పావని, టేస్టీ తేజ, జబర్దస్త్ అవినాష్ ఉన్నారు.

ALSO READ | Bigg Boss: బిగ్బాస్ లోకి వైల్డ్కార్డ్‌తో 8 మంది మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్.. గంగవ్వతో పాటు మరో ఏడుగురు వీళ్లే!

మెహబూబ్ షేక్, గంగవ్వ, జబర్దస్త్ ముక్కు అవినాష్ ముగ్గురు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్. అయితే, గంగవ్వ సీజన్ 4లో అనారోగ్యం కారణంగా స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా  వైల్డ్కార్డ్‌ ఎంట్రీస్లో  సీజన్ 7 నుంచి ముగ్గురు ఉన్నారు. ఈ శనివారం ఎపిసోడ్‌లోనే వీళ్ల ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.ఈ షోలో మాజీ కంటెస్టెంట్స్‌ గ్రాండ్ సాంగ్స్ తో, తమదైన డ్యాన్స్ స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారని టాక్.

ఈ సంద‌ర్భంగా కొత్త ప్రోమోల‌ను విడుద‌ల చేశారు.శనివారంకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలో గుర్తు పెట్టుకోండి.. ఇవాళే మీకు ఆఖ‌రి రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా అని నాగార్జున కంటెస్టెంట్‌లతో అన‌డం చూడ‌వచ్చు. దీంతో ఆదివారం (అక్టోబర్ 6) బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే 2.0 లాంచ్ ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీల టెలీకాస్ట్ చేయనున్నారని తెలుస్తుంది.

మ‌రో ప్రోమోలో మ‌ణికంఠ‌పై నాగార్జున సీరియస్ అయిన‌ట్లు.. అత‌డిని యాక్ష‌న్ రూమ్‌లోకి పిలిపించుకోని ఎంత ఏడుస్తావో ఏడువు అంటూ ఈ ప్రోమోలో చెప్ప‌డం చూస్తుంటే శనివారం ఎపిసోడ్ ర‌స‌వ‌త్తరంగా సాగ‌బోతున్న‌ట్లు అర్ధమవుతోంది.