Bigg Boss Telugu 8: వీళ్ళ శాడిజం పీక్ స్థాయికి..ఇష్టం వచ్చినట్టు అరిస్తే ఎట్లా!

Bigg Boss Telugu 8: వీళ్ళ శాడిజం పీక్ స్థాయికి..ఇష్టం వచ్చినట్టు అరిస్తే ఎట్లా!

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటిన్యూగా టాస్కులు ఆడించారు. బిగ్ బాస్ కట్ చేసిన రూ. 2 లక్షల ప్రైజ్ మనీని సంపాదించుకునేందుకు మూడు క్లాన్స్ గేమ్స్ ఆడారు. ఈ క్రమంలోనే తనను ఎప్పుడు తిట్టే సోనియా కాళ్లు మొక్కింది విష్ణుప్రియ. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం గమనిస్తూ వస్తున్నాం. మరి లేటెస్ట్ ఎపిసోడ్ లో ఎవరు ఎలాంటి ఎత్తులతో తమ ఆట ఆడారో ఒక లుక్కేద్దాం. 

గురువారం సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో ప్రేక్షకులు అసలు ఊహించని సంఘనటలు జరిగాయి. సోనియా, యశ్మీ, పృథ్వీ మరి చిరాకు పెట్టించేలా ప్రవర్తించారు. ఒకరంటే ఒకరు తగ్గకుండా ప్రేక్షుకులకు చిరాకు తెప్పిస్తూ..నోరు వేసుకుని ఇతరులపై పడిపోతున్నారు. దీంతో వీరి ఆటను చూసే ఆడియన్స్ కి ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదు..ఒక్క చిరాకు తప్ప. 

బిగ్ బాస్ పెట్టె టాస్కులు ఆడాలంటే..ఇష్టం వచ్చినట్టు అరవాలా యెట్లా? అనే మాదిరి ఉంది వీరి పెర్ఫార్మన్స్. ఈ ముగ్గురు టాస్క్‌లు ఆడేది తక్కువ అరచుకోవడం ఎక్కువ అన్నట్లుగా కనిపించారు. అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ యష్మీ పేరు చెప్పవచు. ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వి.

ఇక మరోవైపు తన దూకుడుతనంతో గట్టి పోటీస్తోంది సోనియా. వీరందరి చేష్టలు చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో శాడిజం పీక్ స్థాయికి చేరుకున్నట్లుగా అర్థమవుతుంది. టాస్క్‌లను నిజాయతీగా ఆడటం కంటే ఎదుటి కంటెస్టెంట్ గేమ్ చెడగొట్టడంలో పృథ్వీరాజ్ ముందున్నాడు. అయినా, ఏ ఒక్క టాస్క్ గెలవలేదు. ఇకపోతే , సోనియా ఆకుల ఆట మరింత విచిత్రం సుమ! ఎదుటివాళ్లను విమర్శించడం, బాధ్యత, పర్ఫెక్షన్ అని మాటలు చెప్పడం తప్పితే చేతల్లో మాత్రం అవేం కనిపించట్లేదు.

ALSO READ | బిగ్ బాస్ 8వ సీజన్: రెండోవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

లేటెస్ట్ గా కంప్లీట్ అయినా ఎపిసోడ్ లో యష్మీ తనదైన శాడిజంను రిఫ్లెక్ట్ చేసింది. ఇప్పటివరకు కేవలం మాటల వరకే పరిమితమైన తన పెర్ఫార్మన్స్ ఇప్పుడు చేష్టలతో రెచ్చిపోతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఫూల్ టాస్క్ లో మణికంఠను ఆపేసి గేమ్ ఫోల్డ్ చేశాడు పృథ్వి. ఈ విషయంపై యష్మీకి చెప్పడానికి వెళ్తే.. నా ఇష్టం నేను ఇలానే ఆడతాను, నాకు నచ్చినట్టే ఆడతను అంటూ తిక్క సమాధానం ఇచ్చి అందరికి విసుగు వచ్చేలా డైలాగ్ వేసింది.

అంతేకాకుండా..నిఖిల్ లగ్జరీ రూమ్ లోకి వెళ్ళగానే మరోసారి చిరాకు తెప్పించేసింది. 'మా ఆట మేము ఆడుకుంటాం.. ఇలాగే మేము ఆడుతాం.. క్లారిటీ లేకుండా యష్మీ తిక్కగా ఆన్సర్ ఇస్తూ బిహేవ్ చేసింది. ఇక మరోవైపు మణికంఠ స్థానంలో నేను ఉంటే అలా రఫ్ గా కూడా ఆడేవాన్ని..ఎవరికైనా ఏదన్నా తగిలితే ఎవరూ రెస్పాన్సిబులిటీ.. మనమంతా ఆర్టిస్టులమంటూ పృద్వితో నిఖిల్ చాలా ప్రశాంతంగా మాట్లాడారు.

మొత్తానికి..యశ్మీకి తెలిసేది, అర్థమయ్యేది చాలా తక్కువ. కానీ, తన చేష్టలతో, హ్యాండ్ మూమెంట్స్‌తో ఛీ అనిపించుకోవడం ఎక్కువ అయిపోయింది. దీంతో వీళ్ళ శాడిజం పీక్ స్థాయికి..ఇష్టం వచ్చినట్టు అరిస్తే ఎట్లా! అని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.