
- కుటుంబంలోని నలుగురికి అస్వస్థత
- వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిక
- రేష్మ మృతదేహాన్ని బయటికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం!
- మోమోస్ అమ్మిన ఆరుగురిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
- 110 ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్సిటీ/పంజాగుట్ట, వెలుగు: మోమోస్ విక్రయించిన వారితో పాటు వాటిని తయారు చేసిన వాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Upon receipt of complaints regarding health issues due to Momos consumption, Food Safety officials have traced the location of the vendor, with support from Police Department, and conducted an inspection on 28.10.2024.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) October 28, 2024
??? ??? ????? / ????? ??? ?????… pic.twitter.com/ru3ZsI1c6W
వారిలో బిహార్కు చెందిన అర్మాన్, సాధిక్, రజిక్, అనిఫ్, ముఖ్రం, ఆలం ఉన్నారు. వీరంతా మూడేండ్ల కింద హైదరాబాద్ సిటీకి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఉంటు న్నారు. 8 నెలల కింద ఖైరతాబాద్లోని చింతల్బస్తీకి మకాం మార్చి మోమోస్ తయారు చేయడం ప్రారంభించారు. వాటిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు.
బంజారాహిల్స్లోని నందినగర్, సింగాడికుంటలో మోమోస్ తిని అస్వస్థతకు గురైన వారి సంఖ్య 97కు చేరింది. శుక్రవారంమోమోస్ తిన్న రేష్మ బేగం..ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయింది.
మరో 39 మంది అస్వస్థతకు గురై సిటీలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి సోమ, మంగళవారం నందినగర్, సింగాడికుంట సర్వే నిర్వహించారు. 214 ఇండ్లను సందర్శించారు.
మోమోస్ తినడంతో తామూ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు 57 మంది తెలిపారు. దీంతో బాధితుల సంఖ్య 97కు చేరింది. వీరిలో కొందరికి ఓపీలో ట్రీట్మెంట్ ఇప్పించి న వైద్య శాఖ అధికారులు.. మరికొందరిని దగ్గర్లోని హాస్పిటల్స్కు తరలించారు.
అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వాతి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఏడుగురిని, తన్వీర్ హాస్పిటల్లో ఆరుగురిని జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు మంగళవారం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.