అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు స్పాట్లోనే..

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు స్పాట్లోనే..

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(అక్టోబర్11) ఉదయం రాయపర్తి మండలం వాంకుడోతు తండా శివారులో అదుపుతప్పి బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్లోనే చనిపోయారు. మృతులు రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఈదునూరి అన్వేష్(19), ఎర్ర రాజు (24) లుగా గుర్తించారు. విషయంతెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరు విలపించారు.