
కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపల్ 15వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బింగి శివానీ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో ఆదివారం మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో అధికార పార్టీ కౌన్సిలర్ రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కౌన్సిలర్ బింగి శివానీ తన రాజీనామాను మున్సిపల్ కమిషనర్వెంకటనారాయణకు అందించారు. మున్సిపల్పాలకవర్గంలో ప్రజల సమస్యలపై మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఏదీ చెబితే దానికి చేతులు ఎత్తి రావడం తప్ప స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఇందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియతృత్వ పొకడలే కారణమని ఆరోపించారు.