IND vs SL 2024: మరికొన్ని గంటల్లో ఇండియాతో మ్యాచ్.. ఆస్పత్రి పాలైన లంక పేసర్

IND vs SL 2024: మరికొన్ని గంటల్లో ఇండియాతో మ్యాచ్.. ఆస్పత్రి పాలైన లంక పేసర్

శనివారం(జులై 27) భారత్‌తో జరగాల్సిన తొలి టీ20కి ముందు శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ బినురా ఫెర్నాండో ఆస్పత్రి పాలయ్యాడు. ఛాతీ ఇన్‌ఫెక్షన్ కారణంగా అతను ఆసుపత్రిలో చేరవలసి వచ్చినట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రమేష్ మెండిస్‌ను స్టాండ్‌బైగా జట్టులోకి తీసుకున్నారు.

మరోవైపు దుష్మంత చమీర, నువాన్ తుషార గాయాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. చమీర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దాంతో, ఆతిథ్య జట్టు అయోమయంలో ఉంది. ధోని శిష్యుడు మతీషా పతిరణతో పాటు మీడియం-పేసర్లు అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంకలకు జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురిపైనే ఆ జట్టు పేస్ భారమంతా.

టీ20 సిరీస్ షెడ్యూల్

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో శనివారం (జూలై 27) తొలి టీ20 జరగనుండగా.. ఆదివారం (జూలై 28) రెండో టీ20, మంగళవారం(జులై 30) చివరి టీ20 జరగనుంది. మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. Sony Sports Ten 1, Sony Sports Ten 1 HD, Sony Sports Ten 5, Sony Sports Ten 5 HD TV ఛానెళ్లలోప్రత్యక్ష ప్రసారాలు ఆస్వాదించవచ్చు.