
అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమా దేవి బర్మాన్ ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్గా పిలిచే వైట్లీ గోల్డ్ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్నాలకుగాను ఈ అవార్డు వరించింది. ఈ పక్షిజాతి జనాభా ఈశాన్య భారతదేశంలో 450కి తగ్గడంతో వీటిని సంరక్షించేందుకు, కొంగల నివాసాల(వీటి గూళ్లు)ను రక్షించడానికి స్థానిక కమ్యూనిటీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె ప్రోత్సహిస్తుంది. ఈ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా గ్రామ స్థాయిలో జీవ వైవిధ్యత, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టే వారికి వైట్లీ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూఎఫ్ఎన్) సంస్థ వైట్లీ గోల్డ్ అవార్డుతోపాటు లక్ష గ్రేట్ బ్రిటన్ పౌండ్లను నగదు బహుతిని అందజేస్తుంది.
గ్రేటర్ అడ్జటెంట్ కొంగ
సికోనిడే కుటుంబానికి చెందిన ఈ పక్షుల్లో సుమారు 20 రకాల జాతులు ఉన్నాయి. ఇవి పొడవాటి మెడను కలిగి ఉంటాయి. ఇవి దక్షిణ, ఆగ్నేయాసియాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచంలో అంతిరించిపోతున్న జాతుల్లో ఈ కొంగ జాతి కూడా ఒకటి. కంబోడియా, భారతదేశంలో (అసోం, బిహార్)లలో మాత్రమే సంతోన్పత్తి ప్రదేశాలు ఉన్నాయి.