కరీంనగర్ లో బిర్యానీ వర్సెస్ పులావ్  ప్రోగ్రామ్

కరీంనగర్ లో బిర్యానీ వర్సెస్ పులావ్  ప్రోగ్రామ్

కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ, హోటల్  మేనేజ్‌‌మెంట్‌‌ కాలేజీలో స్టేట్ షెఫ్​ అసోసియేషన్  ఆధ్వర్యంలో గురువారం బిర్యానీ వర్సెస్ పులావ్ కార్యక్రమం నిర్వహించినట్లు చైర్మన్ రవీందర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ మేనేజ్‌‌మెంట్‌‌ డిగ్రీతో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. 

స్టూడెంట్లు 200 రకాల  బిర్యానీ, పులావ్‌‌ వంటకాలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్  చైర్మన్ సాకేత్ రామారావు,  ప్రిన్సిపాల్స్ అర్జున్‌‌రావు, కృష్ణమోహన్, స్టేట్ షెఫ్​ అసోసియేషన్  జనరల్ సెక్రటరీ  నవీన్, మెంబర్లు పాల్గొన్నారు.