
పదార్థాన్ని పరమాణువు స్థాయిలో మనకు కావాల్సిన రీతిలో మలచుకోవడానికి వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానం నానో టెక్నాలజీ.
- 2-3 పరమాణువుల పరిమాణం ఒక నానోమీటర్. కాబట్టి దీనిని నానో టెక్నాలజీ అని పిలుస్తారు.
1959లో తొలిసారిగా రిచర్డ్ ఫెయిన్ మాన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈ భావనను ప్రతిపాదించాడు.
1974లో టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన నొరియో తానిగుచి అనే జపాన్ శాస్త్రవేత్త నానోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించాడు.
పరమాణువుల స్థాయి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్మించడం ద్వారా వాటి పరిమాణాన్ని పూర్తిగా తగ్గించడానికి వీలవుతుంది.
కార్బన్ నానో ట్యూబ్స్, నానో క్రిస్టల్స్ వంటి ప్రస్తుతం అధిక వినియోగంలోకి వస్తున్నాయి.
స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ (ఎస్టీఎం) ఫ్లోరెసెన్స్ మైక్రోస్కోపి, స్కానింగ్ ప్రోబ్ మైక్రోస్కోప్ వంటి అత్యాధునిక సూక్ష్మదర్శిని పరికరాల ద్వారానే నానో పదార్థాలను నిర్మించగలుగుతారు.
వాటర్ ఫిల్టర్స్, ఎయిర్ కండీషనింగ్, మొబైల్స్, ఎయిర్ ఫిల్టర్స్, విమాన, ఆటోమొబైల్స్ నిర్మాణం, కాంపోజిట్స్ తయారీ, నానోట్యూబ్స్, నానోక్రిస్టల్స్ వంటి పరకరాల తయారీలో నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
వైద్యరంగంలో నానోటెక్నాలజీని ఉపయోగించి ఔషధాలను సంబంధిత అవయవాలను చేరవేసే నానోబోట్స్(నానో రోబోట్స్) ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
నానో బయో ఇంజినీరింగ్ ద్వారా సెల్యులోజ్ను ఇథనాల్గా మార్చి ఇంధనం ఉపయోగించే వీలు కల్పించే ఎంజైములను నానో టెక్నాలజీ ద్వారా రూపొందించారు.
నానో టెక్నాలజీ ద్వారా మడతలు పడని, మరకలు అంటుకోని నానో ఫ్యాబ్రిక్స్ అందుబాటులోకి వచ్చాయి.
పాలీమర్ కంపోజిట్స్లోకి నానో పదార్థాలను ప్రవేశ పెట్టడం ద్వారా తేలికైన దృఢంగా ఉండే బేస్బాల్ బ్యాట్స్, టెన్నిస్ రాకెట్స్, హెల్మెట్స్, ఆటోమొబైల బంపర్స్ అందుబాటులోకి వచ్చాయి.
గాజుపై నానో ఫిల్మ్ కోటింగ్ ద్వారా ఎలాంటి పదార్థాలు అంటుకోవు. ఇలాంటి గాజును కిటికీ అద్దాలు, కంప్యూటర్, కెమెరా డిస్ ప్లేల్లో వినియోగించుట ద్వారా వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు.
బంగారం నానో రేణువులను అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారు.
పొటాషియం మాంగనీసు ఆక్సైడ్ పదార్థంతో తయారుచేసిన నానో ఫాబ్రిక్ తన బరువుకు 20 రెట్లు ఆయిల్ను గ్రహించగలదు. కాబట్టి దీన్ని క్లీనింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తారు.
క్వాంటమ్ డాట్స్ అనే అర్థవాహక నానో క్రిస్టల్స్ ద్వారా మెరుగైన మెడికల్ ఇంజినీరింగ్ సాధ్యమవుతుంది.
పేపర్ మందంలో సౌరప్యానల్స్ ఇప్పటికే నానో టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను ఉద్దేశించి నానోటెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 2007 మేలో భారత ప్రభుత్వం నానో సైన్స్ & టెక్నాలజీ మిషన్ను ప్రారంభించింది.